
నేటి నుంచి ‘మల్లన్నసాగర్’ కోసం దీక్ష
మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండుతో బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లుగా...
టీపీసీసీ అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాశ్రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండుతో బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లుగా టీపీసీసీ అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి) ప్రకటించారు. జీవో 123ని హైకోర్టు కొట్టివేసినా అప్పీలుకు వెళ్లడం దారుణమన్నారు. భూసేకరణ చట్టం-2013ను అమలు చేయాలని, నిర్వాసితులందరికీ చట్టం ప్రకారం పునరావాస చర్యలను తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు కట్టాలి కానీ వాటికోసం రైతులు, కూలీలు, వృత్తిదారుల పొట్ట కొట్టొద్దని కోరారు.