ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ విగ్రహ ఏర్పాటు
► తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్బండ్పై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 5వ వర్ధంతిని గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమారస్వామి తదితరులు ఘనంగా నివాళులర్పించారు.