'మనిషికైతే ఒకసారి చెబుతారు' | kadiyam srihari takes on TDP Leaders over caste issue | Sakshi
Sakshi News home page

'మనిషికైతే ఒకసారి చెబుతారు'

Aug 12 2015 3:18 PM | Updated on Oct 30 2018 7:30 PM

'మనిషికైతే ఒకసారి చెబుతారు' - Sakshi

'మనిషికైతే ఒకసారి చెబుతారు'

తన పుట్టుక, కులంపై టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు.

హైదరాబాద్: తన పుట్టుక, కులంపై టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. వారి దగ్గర వాస్తవాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నేతల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉన్నా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఎర్రబెల్లి దయాకర రావు తీరు బండి కింద కుక్క సామెతలా ఉందని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ నేతలు దామోదర నర్సింహ, మల్లు భట్టివిక్రమార్క కూడా మాది ఉప కులాలకు చెందినవారేనని చెప్పారు. తనపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మనిషికైతే ఒకసారి చెబుతారు, సంస్కారహీనులకు ఎలా చెప్పాలని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement