ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల | IIT-JEE advanced results released | Sakshi
Sakshi News home page

ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల

Jun 17 2015 10:34 PM | Updated on Sep 3 2017 3:53 AM

జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను సీబీఎస్ఈ బుధవారం విడుదల చేసింది. ఒకరోజు ముందుగానే ఫలితాలను ఐఐటీ ముంబయి విడుదల చేసింది.

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను బుధవారం ఐఐటీ ముంబయి విడుదల చేసింది. ఒకరోజు ముందుగానే ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో మొత్తం 26, 456 మంది అర్హత సాధించారు. అర్హత సాధించినవారిలో 3,040 మంది బాలికలు ఉన్నారు. తొలి పది ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు పలు ర్యాంకులను దక్కించుకోగా, చెన్నై జోన్కు 5 ర్యాంకులు వచ్చాయి.

ఎస్సీ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన తురకభవన్కు తొలి ర్యాంకు వచ్చింది. ఎస్టీ విభాగంలో విశాఖ జిల్లాకు చెందిన హర్షమీనాకు తొలి ర్యాంకు దక్కింది. ఓబీసీ విభాగంలో విజయనగరానికి చెందిన సందీప్ కుమార్కు తొలి ర్యాంకు దక్కింది. కాగా, ఓపెన్ కేటగిరీలో ఆహ్వాన రెడ్డికి ఆరోవ ర్యాంకు, కామన నాగేందర్ రెడ్డి నాల్గోవ ర్యాంకు దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement