అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం! | high court fires over ap officers over house collapses in crda region | Sakshi
Sakshi News home page

అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!

Dec 1 2016 5:08 PM | Updated on Mar 23 2019 9:06 PM

అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం! - Sakshi

అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్డీఏ పరిధిలోని తాడికొండ గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల తీరును తప్పుబట్టింది. వెంటనే ఇళ్ల కూల్చివేతలను ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది.

గుంటూరు ఆర్డీఓ రికార్డులతో 15 రోజుల్లో హైకోర్టుకు హాజరుకావాలని సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement