బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి: వీహెచ్ | hanumanta rao attack on chandrababu | Sakshi
Sakshi News home page

బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి: వీహెచ్

Feb 27 2016 5:07 PM | Updated on Mar 22 2019 6:16 PM

బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి: వీహెచ్ - Sakshi

బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి: వీహెచ్

ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని గతంలో కేసీఆర్ను విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పనిని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శించారు.

హైదరాబాద్: ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొనుగోలు చేస్తున్నారని గతంలో కేసీఆర్ను విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పనిని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శించారు. ఇతర పార్టీల వారిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమో బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వీహెచ్ సూచించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పార్లమెంట్లో అబద్ధాలు చెప్పారని, దీనిపై ప్రివిలైజ్ మోషన్ నోటీసు ఇవ్వాలని హైకమాండ్కు సూచించినట్లు వీహెచ్ తెలిపారు. రోహిత్ మరణానికి సామాజిక బహిష్కరణే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావులను శిక్షించాల్సిందేనని వీహెచ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement