♦ కార్బైడ్ వాడకంపై హైకోర్టు
♦ ప్రజలకు అవగాహన కల్పించండి
♦ ‘అమికస్’ సూచనల అమలుకు సిద్ధమని హైకోర్టుకు నివేదించిన ఉభయ రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: కార్బైడ్తో పండ్లను మగ్గబెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని తినడానికి భయపడాల్సి వస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము కూడా పండ్లను ఒకటికి నాలుగు సార్లు పరిశీలించిన తర్వాతే తిం టున్నామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండ్లను వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పండ్లను మగ్గబెడుతున్న విధానంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు దానిపై విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమా ర్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా ఇరు ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో కార్బైడ్ నిరోధానికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని, ఈ విషయంలో కోర్టు సహాయకారి (అమికస్క్యూరీ) చేసిన సూచనలు, సల హాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి హైకోర్టుకు నివేదించాయి. అలా అయితే హానికర రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా పండ్లను మాగబెట్టే ప్రక్రియకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమూలంగా నిర్మూలించాలంటే ముం దు సామాన్య ప్రజలకు ఏవి సహజంగా మగ్గిన పండ్లు, ఏవి కృత్రిమంగా మగ్గబెట్టినవి అన్న విషయంపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాలని సూచించింది.
రసాయన ప్రక్రి య ద్వారా పండ్లను మగ్గబెట్టినట్లు వినియోగదారులకు అనుమానం వస్తే, ఆ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఓ ఫోన్ నంబర్ను కేటాయించాలని, దాని గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచిం చింది. తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యాపారుల్లో భయం కలిగించాలి...
విచారణ సందర్భంగా అమికస్ క్యూరీ ఎస్.నిరంజన్రెడ్డి స్పందిస్తూ రసాయన ప్రక్రియ ద్వారా పండ్లను మగ్గబెడుతున్న వ్యాపారులపై కఠినంగా వ్యహరించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు చర్యలకు పాల్పడే వ్యాపారుల్లో ఒకింత భయాన్ని కలిగించాలని, ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. కల్తీ పండ్లకే పరిమితం కాలేద ని పాలు, కూరగాయలు వినియోగించలేని పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. ఆహారభద్రత చట్ట నిబంధనల ప్రకారమే కాక ఐపీసీ కింద కూడా కేసులు నమోదు చేయవచ్చని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పండ్లు తినాలంటే భయమేస్తోంది
Published Tue, Apr 5 2016 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement