రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి


సాక్షి, మేడ్చల్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం అవుసాపూర్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వీబీఐటీ కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోన్న వినోద్‌(21) తన బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బీటెక్ విద్యార్థి వినోద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top