ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు జూపార్కు ఉద్యోగులను సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
జూపార్కులో ఉద్యోగుల ధర్నా
Sep 8 2017 3:33 PM | Updated on Sep 12 2017 2:16 AM
హైదరాబాద్: ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు జూపార్కు ఉద్యోగులను సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. బహదూర్ పురాలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది బిక్షపతి, శ్రీనివాస్ అనే వారు ఇటీవల సస్పెన్షన్కు గురయ్యారు. వారిని అకారణంగా శిక్షించారంటూ జూ ప్రాంగణంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
సస్పెన్షన్ను వెంటనే తొలగించి వారిని విధుల్లోకి తీసుకోవాలని జూపార్కు జేఏసీ నాయకుడు దేవేందర్ డిమాండు చేశారు. ఆందోళన కారణంగా మూగ జీవులకు ఉదయం 10 గంటలకు అందాల్సిన ఆహారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందించారు.
Advertisement
Advertisement