టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: డీఎస్ | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: డీఎస్

Published Sat, Jan 30 2016 3:53 AM

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: డీఎస్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ ప్రత్యేక సలహా దారు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం డీఎస్ విలేకరులతో మాట్లాడారు.  తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళికలతో సీఎం కేసీఆర్ ముందుకు వెళుతున్నారని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీల హామీలు శ్రుతిమించుతున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అవకాశం కల్పిస్తున్నాయని.. ఈ ఎన్నికల్లో  అధికార టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతాయని వివరించారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్‌షోలకు వస్తున్న జనమే దీనికి నిదర్శనమన్నారు.

 

Advertisement
Advertisement