డీజేకు అనుమతి లేదు: సీపీ | cp mahender reddy on ganesh navaratri | Sakshi
Sakshi News home page

డీజేకు అనుమతి లేదు: సీపీ

Aug 24 2017 3:24 PM | Updated on Sep 12 2017 12:56 AM

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు 24 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సారి బందోబస్తులో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. జియో ట్యాగింగ్‌ ద్వారా అనుమసంధానిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో డీజేకి అనుమతి లేదని.. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement