మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు.
హైదరాబాద్: రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.
స్థానికంగా నివాసముంటున్న శంకరి అనే మహిళ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని 2 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.