హెచ్‌సీఏ ప్రతినిధులపై కేసు | case file on hyderabad cricket association members | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ ప్రతినిధులపై కేసు

Apr 29 2016 1:14 PM | Updated on Sep 3 2017 11:03 PM

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేసిన స్టేడియం ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉప్పల్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేసిన స్టేడియం ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు... భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లోనే ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి అనుమతి ఉంది. ఈ నెల 23న స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) సభ్యులు పీకే శాస్త్రి, కోటిరెడ్డి స్టేడియంలోని సౌత్ గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తులో నిబంధనలను పక్కన పెట్టి  ఆహారాన్ని సరఫరా చేశారు. ఈ విషయాన్ని భద్రతా పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కానీ, ఆలస్యంగా మీడియాకు వెల్లడించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement