ఉప్పల్లోని రాజీవ్గాంధీ క్రికెట్ స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేసిన స్టేడియం ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉప్పల్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ క్రికెట్ స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేసిన స్టేడియం ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు... భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లోనే ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి అనుమతి ఉంది. ఈ నెల 23న స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హెచ్సీఏ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) సభ్యులు పీకే శాస్త్రి, కోటిరెడ్డి స్టేడియంలోని సౌత్ గ్రౌండ్ఫ్లోర్, మొదటి అంతస్తులో నిబంధనలను పక్కన పెట్టి ఆహారాన్ని సరఫరా చేశారు. ఈ విషయాన్ని భద్రతా పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కానీ, ఆలస్యంగా మీడియాకు వెల్లడించడం గమనార్హం.