వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు.
ది న్యూ గ్రీన్ బావర్చిపై కేసు
Apr 6 2017 1:04 PM | Updated on Sep 5 2017 8:07 AM
హైదరాబాద్: వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. గత మూడు రోజులుగా నగరంలోని పలు హోట్లళపై దాడులు నిర్వహిస్తున్నారు. నాణ్యత పాటించని హోటళ్లపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు. తాజాగా ఎల్బీనగర్లోని ది న్యూ గ్రీన్ బావర్చి హోటల్లో గురువారం తనిఖీలు చేపట్టిన జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు పాడైపోయిన చికెన్, ఈగలు వాలిన ఆహారపదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హోటల్ యాజమాన్యం పై రూ.10 వేల జరిమాన విధించడంతో పాటు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement