హైదరాబాద్: ఎంఐఎం నేతలు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న పాక్, బంగ్లా, నైజీరియా దేశీయులను తక్షణమే ఇక్కడి నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.
Related news
-
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎలా అంటావ్?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని సీఎం రేవంత్రెడ్డిని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నిలదీశారు. దమ్ముంటే దీనిపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపైనా చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక, ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక.. రేవంత్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్రెడ్డి విమర్శించారు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే లెంపలేసుకుని గద్దె దిగిపోవాలని వ్యాఖ్యానించారు. ఒట్లు, ప్రమాణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రజలకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి, బీసీ రిజర్వేషన్ల పేరుతో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. రాష్ట్రంలో ఒకటి రెండు లోక్సభ సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతుండటాన్ని తట్టుకోలేక బీజేపీపై విష ప్రచారానికి దిగింది. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ దశాబ్దపు పెద్ద అబద్ధం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ రాహుల్ గాం«దీ, రేవంత్రెడ్డి దు్రష్పచారం చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల ఆదరణ కొరవడటంతో కొత్త నాటకానికి తెరలేపింది. అబద్ధపు పునాదులపై ఎదిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. బీసీ రిజర్వేషన్లు తగ్గించి, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో గండి కొట్టినది కాంగ్రెస్ పార్టీయే. అలాంటి కాంగ్రెస్కు రిజర్వేషన్లపై బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు. అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్దిపేట సభలో చేసిన ప్రసంగాన్ని మారి్ఫంగ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిందంటే.. ఆ పార్టీ దిగజారుడుతనడానికి పరాకాష్ట. బీజేపీ స్థైర్యాన్ని దెబ్బతీసి, సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొటే ప్రయత్నం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై పోలీసు కేసు పెట్టాం. ఈసీకి ఫిర్యాదు చేశాం. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గుర్తించారు ప్రధాని మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ నాటకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలు కూడా కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను గుర్తించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత కనిపించడం లేదు. భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే.. కాంగ్రెస్ చోడో అంటూ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. బీసీలకు న్యాయం బీజేపీతోనే.. దేశంలో అత్యున్నత పదవుల నుంచి రాజకీయ రంగం దాకా బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమే. తొలిసారి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా కేంద్ర కేబినెట్లో ఏకంగా 27 మంది బీసీలు, 12 మంది దళితులు, 8 మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చిన ఘనత బీజేపీదే. మోదీ మూడో సారి ప్రధాని కాబోతున్నారని తట్టుకోలేక కాంగ్రెస్ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో వారికి న్యాయం చేయడం బీజేపీతోనే సాధ్యం..’’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్?
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్ కొట్టు... టికెట్ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్ అయితే ఆయ్యారు కానీ అవతల టికెట్ ఇవ్వాల్సిన వాళ్లు మాత్రం కామ్గా చేతులెత్తేస్తున్నారు. దీంతో నెక్ట్స్ ఏం చేయాలో తోచని ఆయోమయ పరిస్థితుల్లో మరో పార్టీకి జంప్ ఆలోచనలో ఉన్నారు ఎంపీ వెంకటేష్.తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిశారు. పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. అయిన్పటికీ గోమాస శ్రీనివాస్ నేడు నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అసలు పెద్దపల్లి బీఫామ్ను బీజేపీ ఎవరికి ఇవ్వనుంది, వెంకటేష్ నేత అసలు పోటీ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నామినేషన్ చివరి రోజైన రేపు(గురువారం) పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకుడైన వెంకటేష్ నేత గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. అయితే మళ్లీ బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందో రాదో అని భావించిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. కేవలం ఎంపీ టికెట్ కోసం కండువా మార్చేసినా.. చివరికి నిరాశే మిగిలింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మొండిచేయి చూపింది. గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్లో ఉండి ప్రయోజనం లేదంటూ మళ్లీ పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ నేత బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి -
రాజ్యాంగం మార్చేస్తాం.. ఈ ఎన్నికల తర్వాత అన్నీ ఛేంజ్
రాజ్యాంగం మార్చేస్తాం.. ఈ ఎన్నికల తర్వాత అన్నీ ఛేంజ్ -
బీఆర్ఎస్, కాంగ్రెస్లవి అవినీతి ప్రభుత్వాలు
రాంగోపాల్పేట్ /సికింద్రాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ఏర్పడితే నీతివంతమైన పాలన అందుతుందని ప్రజలు ఆశించారని, కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్యాట్నీ సెంటర్లో నిర్వహించిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ కేంద్రంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అప్పుడు అవినీతి పెరిగిపోయిందని, ఆ పార్టీ నాయకుల మీద అవినీతి కేసులు నమోదై మంత్రులు కూడా జైలుకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలో వచ్చిన పదేళ్లలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించి రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ధ్వజమెత్తారు. కాగా, కిషన్రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసని కులం, మతం, రంగును ఆయన చూడరని, ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎలాంటి అవినీతి మరక ఆయనకు అంటలేదని అన్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల నుంచి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్లను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. పదేళ్లలో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టాం: కిషన్రెడ్డి గత పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.719 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నైతిక విలువలకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేశానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మరో మారు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువతకు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, మరో మారు మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రేపు అనేది లేదని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఈటల రాజేందర్, మర్రి శశిధర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్సింగ్ రాథోడ్, శ్యాంసుందర్గౌడ్, చీర శ్రీకాంత్ పాల్గొన్నారు. కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన కిషన్రెడ్డి కిషన్రెడ్డి నామినేషన్ కార్యక్రమం శుక్రవారం కోలాహలంగా సాగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ నేతలు లక్ష్మణ్ తదితరులతో కలసి కిషన్రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎస్వీఐటీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ సభలో మాట్లాడారు. తర్వాత సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. పార్టీ నేతలు లక్ష్మణ్, శ్యాంసుందర్గౌడ్, శారదామల్లేశ్, అజయ్కుమార్ ఆయన వెంట ఉన్నారు. కాగా, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కూడా రాజ్నాథ్సింగ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అవుట్ డేటెడ్ పార్టీ.. రాజ్నాథ్ సింగ్ సెటైర్లు
హైదరాబాద్,సాక్షి : కాంగ్రెస్ అవుట్డేటెడ్ పార్టీ.. దేశ రాజకీయాల్లో ఉనికిని కోల్పోతుంది అని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియకు ముందు ఏర్పాటు చేసిన పార్టీ సభలో రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ కాలం చెల్లిపోయింది. దేశ రాజకీయాల్లో తన ఉనికిని కోల్పోయింది. బీజేపీ మాత్రం దేశ నిర్మాణం కోసమే రాజకీయాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఉద్దేశించి, తెలంగాణలోని అధికార పార్టీకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు ఘనత బీఆర్ఎస్కు కాదని, అనేక మంది త్యాగాల వల్లే దక్కుతుందని సూచించారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ..అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ.. మోదీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజ్గిరి)లకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. Secunderabad resonates with #PhirEkBaarModiSarkar My gratitude to Hon’ble Union Minister for Defence and Senior BJP leader Shri @rajnathsingh for joining & addressing the nomination rally in Secunderabad. The determination of the people of #Secunderabad in re-electing… pic.twitter.com/9EA3wDwtly — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) April 19, 2024 బీఆర్ఎస్ను తరిమి కొట్టినందుకు గడిచిన పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఒక్క అవినీతి లేకుండా నరేంద్ర మోడీ పాలన చేస్తున్నాడని కేంద్ర క్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. ఖమ్మం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం నగరంలోని జెడ్.పీ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే అని విమర్శించారు. ఈ ప్రభుత్వాల హయాంలో రైతులను మోసం చేసి యూరియా కుంభకోణం చేశాయని,రైతులపై భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు మోదీ ఆర్ధిక సాయం చేశారన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని అమలు చేశామని గుర్తు చేశారు.మహిళలకు సమాన హక్కుల కోసం మోదీ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. ముస్లింల కోసం త్రిపుల్ తలాకును తొలగించామని,మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. బీజేపి అధికారంలోకి రాగానే దేశంలో ఓకే పౌరసత్వాన్ని తీసుకురాబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానిగా పనిచేసినప్పుడు పేదరికం తొలగిస్తామన్నారు కానీ ఇప్పటికీ పేదరికం అలానే ఉందన్నారు రాజ్ నాధ్ సింగ్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తెలుగు ప్రజలను 22 వేల మందికి పైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీ దన్నారు.బీజేపిని గెలిపించి మూడోసారి మోదీని ప్రధాన మంత్రిని చేద్దామని ఖమ్మం ప్రజలు కూడా బీజేపిని ఆదరిస్తారన్నారు.
Related News by category
-
నామినేషన్ల దాఖలు ఇలా
సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో అతికించాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంది. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. శుభ ముహూర్తాలు ఇవే.. ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. జాతకాలతో ముందుకు... ● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్ వేసే చాన్స్ ఉంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ● నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు లోక్సభ స్థానం రిటర్నింగ్ సెంటర్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, లక్డీకాపూల్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు (సికింద్రాబాద్) మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు, రాజేంద్రనగర్ ● ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ● ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ● ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల ● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ● జూన్ 6న ఎన్నికల ప్రకియ ముగింపు చేవెళ్ల లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ 19 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ మాధవీలత 24 బీఆర్ఎస్ జి.శ్రీనివాస్యాదవ్ 22 ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 19సికింద్రాబాద్ లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ జి.కిషన్రెడ్డి ఏప్రిల్ 19 బీఆర్ఎస్ పద్మారావుగౌడ్ 19 కాంగ్రెస్ దానం నాగేందర్ 24 మల్కాజ్గిరి లోక్సభ స్థానం బీజేపీ ఈటల రాజేందర్ 18 బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి 22 కాంగ్రెస్ పట్నం సునీతారెడ్డి 22 కంటోన్మెంట్లోనూ... కంటోన్మెంట్: లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది. -
సీతారామం
భాగ్యనగరం..పురానాపూల్ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులుజై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ గంగాబౌలి, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి, ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో మంగళ్హాట్ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్ -
డోర్ నెంబర్లూ డొల్లే !
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్నెంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నెంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే కుటుంబం...పోలింగ్ కేంద్రాలెన్నో ! సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు. సాగర్లో ‘పంపింగ్’ ట్రయల్ రన్ షురూ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ కోసం జలమండలి ట్రయల్రన్ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పంప్హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్ కోసం జలాశయంలో జీరో పాయింట్ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ● నగర ఓటరు జాబితాలో వింతలెన్నో ● రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో అయోమయ పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు హైదరాబాద్ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు మరణించిన వారు47,141చిరునామా మారిన వారు4,39,801డూప్లికేట్లు54,2595,41,201మొత్తం -
28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ గచ్చిబౌలి: మత్తుకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎండీఎంఏ డ్రగ్తో పట్టుబడి కటకటాలపాలయ్యారు. మాదాపూర్ ఎస్ఓటీ, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేసి ఇద్దరు స్నేహితులు ఏపీలోని రాజమండ్రి పట్టణం పాతపేటకు చెందిన కాటూరీ సూర్య కుమార్ (22), బాలాజీపేటకు చెందిన గుత్తుల శ్యామ్ బాబు (22)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2023లో డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చినా అతను తీరు మారలేదు. రైల్వేలో సీనియర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు సూర్య కుమార్ బెంగళూర్లోని జైన్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూర్లో తన స్నేహితుడైన అభి ద్వారా డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సాల్మన్ పరిచయమయ్యాడు. డ్రగ్స్కు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ పెడ్లర్గా మారాడు. అంతే కాకుండా తన స్నేహితుడైన శ్యామ్ బాబుకు మత్తు అలవాటు చేశాడు. ఈ నెల 14న బెంగళూర్ వెళ్లిన సూర్య కుమార్ గాడ్ ఆఫ్ సాల్మన్ వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. 16న తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు గ్రాములు ఇద్దరు స్నేహితులు సేవించారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్ర యించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్లోని చందానాయక్ తండాలోని రాజా రెసిడెన్సీ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఎండీఎంఏ సరఫరా చేసిన గాడ్ ఆఫ్ సాల్మన్ పరారీలో ఉన్నాడు. 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో గ్రాము ఎండీఎంఏను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్లో భారీ చోరీ
రూ.70 లక్షల విలువైన నగలు మాయం బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త డీవీఎస్ సోమరాజు నివాసంలో భారీ చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–62లోని ప్లాట్నెంబర్ 1242 (బి)లో సోమరాజుతో పాటు ఆయన తల్లిదండ్రులు శివరామరాజు, అన్నపూర్ణ, భార్య పద్మసూర్య కుమారి, కుమారులు యశ్వంత్ వర్మ, శివ మితీష్వర్మ ఉంటున్నారు. ఈ నెల 4న వీరంతా ఓ వివాహానికి హాజరై సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఆభరణాలను బెడ్రూంలోని అల్మరాలో భద్రపరిచారు. ఈ నెల 15న రాత్రి మరో శుభకార్యానికి వెళ్లే క్రమంలో ఆభరణాలు కోసం చూడగా అల్మరాలో కనిపించలేదు. ఇందులో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్తో పాటు బంగారు గాజులు, చంద్రహారం, డైమండ్ నెక్లెస్, మరో మూడు గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.70 లక్షలు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంట్లో నలుగురు పని మనుషులు ఉంటారని, ఇందులో ఇద్దరు బయటి నుంచి వస్తారని, మరో ఇద్దరు సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపైనే అనుమానం ఉందన్నారు. చోరీకి గురైన ఆభరణాల పక్కనే ఉన్న రూ.40 లక్షల విలువ చేసే నగలు భద్రంగానే ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య జీడిమెట్ల: కుటుంబ కలహాల కారణంగా ఎస్పీఓ పోలీస్ డ్రైవర్ ఉరి వేసుకుని మృతిచెందిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు చెప్పిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వరనగర్లో ఉండే గుంటి శ్రీనివాస్ ఆర్మీలో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్లో ఎస్పీఓ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్కు భార్య భార్గవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన రాత్రి శ్రీనివాస్ తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం 17వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలను బెడ్రూంలోకి పంపించి బయట నుంచి గడియపెట్టాడు. అనంతరం బయట గదిలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. అనుమానం వచ్చిన భార్గవి తలుపులు తీయాలని ఎంత పిలిచినా పలకలేదు. కిటికీలోంచి చూడగా శ్రీనివాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో భార్గవి పక్కింటి వారికి ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తీయగా శ్రీనివాస్ అప్పటికే మృతిచెంది ఉన్నాడు. భార్గవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement