రాణిగంజ్ డిపోలో రూ.10 లక్షలు స్వాహా
కాంట్రాక్ట్ ఉద్యోగి ఘనకార్యం
సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీలో మరో ఇంటిదొంగ గుట్టు రట్టయింది. ఉద్యోగుల జీతాల సొమ్ములోంచి ఏకంగా రూ.10 లక్షలు స్వాహా చేశారు. రాణిగంజ్-1 డిపోలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్క్లర్క్గా పనిచేస్తున్న ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి శివాజీ సంస్థ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతం డబ్బును నొక్కేశాడు. గతంలో మిధానీ డిపోలో జరిగిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
నగరంలోని అన్ని డిపోల్లోని అకౌంట్లను తనిఖీలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ. కోటేశ్వరరావు ఆదేశించారు. గతంలో ఆర్టీసీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులే కావడం గమనార్హం. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన కొందరిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో వినియోగించుకుంటున్నారు. అలా విధులు నిర్వహిస్తున్న వారే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గతనెలలో మిధాని డిపోకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి.. వాణిజ్య కార్యక్రమాల ద్వారా ఆర్టీసీకి లభించిన రూ.40 లక్షలను స్వాహా చేశాడు. స్టాళ్ల ద్వారా వచ్చిన ఆదాయానికి తప్పుడు లెక్కలు చూపించి అతను సొమ్ము కాజేశాడు. ఈ ఘటనపై డిపో అధికారులు వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తాజాగా, రాణిగంజ్-1 డిపో లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి శివాజీ కూడా ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేసిన చెక్కుల్లో అంకెలను మార్చేసి ఎక్కువ డబ్బు డ్రా చేసినట్టు డిపో మేనేజర్ గుర్తించారు. ఇతను విడతల వారీగా మొత్తం రూ.10 లక్షల వరకు స్వాహా చేసినట్టు అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్ని డిపోల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు...
వరుసగా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అన్ని డిపోల్లోనూ ఆదాయ,వ్యయాలపై కచ్చితమైన లెక్కలను సమర్పించాల్సిందిగా డిపో మేనేజర్లను ఆదేశించినట్లు ఈడీ చెప్పారు. ఆర్టీసీ సొమ్ము కాజేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారి నుంచి మొత్తం డబ్బు వసులు చేస్తామని ఆయన చెప్పారు.
ఆర్టీసీలో మరో ఇంటిదొంగ
Published Sun, Dec 15 2013 4:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement