చిట్టీల పేరుతో రూ.70 లక్షలకు టోకరా | 70 lakh fraud in the name of chitfunds | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో రూ.70 లక్షలకు టోకరా

Aug 4 2016 10:31 AM | Updated on Sep 4 2017 7:50 AM

చిట్టీల పేరుతో రూ.70 లక్షలకు టోకరా

చిట్టీల పేరుతో రూ.70 లక్షలకు టోకరా

నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో వసూలు చేసిన రూ.70 లక్షలతో ఉడాయించారు.

హైదరాబాద్: నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో వసూలు చేసిన రూ.70 లక్షలతో ఉడాయించారు ఇద్దరు ఘనులు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ మోసం వెలుగుచూసింది. స్థానికంగా ఉండే అరవింద్, నవీన్‌చంద్ అనే వారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేశారు. గత పది రోజులుగా వారు కనిపించకపోవటంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement