ఏపీ నుంచి తెలంగాణకు 60 మంది ఏఎస్‌వోలు! | 60 ASO's andhra pradesh to telangana | Sakshi
Sakshi News home page

ఏపీ నుంచి తెలంగాణకు 60 మంది ఏఎస్‌వోలు!

Jul 1 2016 2:57 AM | Updated on Sep 4 2017 3:49 AM

సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్‌వోల కేటాయింపు అంశాన్ని డీవోపీటీకి అప్పగించాలని నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్‌వోల కేటాయింపు అంశాన్ని డీవోపీటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఏపీ నుంచి 60 మందికిపైగా ఏఎస్‌వోలు తెలంగాణకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో శుక్రవారం సచివాలయంలో జరిగే కమలనాథన్ కమిటీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీలో పనిచేస్తున్న 263 మంది తెలంగాణ ఉద్యోగుల అంశంపైనా  ఈ భేటీలో చర్చించొచ్చని తెలుస్తోంది. గురువారం స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభజనపై కమలనాథన్ కమిటీ చర్చించింది.

Advertisement
 
Advertisement
Advertisement