వివరణ ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు | 5 YSRCP MLAs Attend AP Privilege committee | Sakshi
Sakshi News home page

వివరణ ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు

Oct 26 2016 1:06 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ ఎదుట అయిదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ ఎదుట అయిదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే) మంగళగిరి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), డాక్టర్ ఎం.సునీల్ కుమార్ (పూతలపట్టు), కిలేటి సంజీవయ్య (సూళ్లూరుపేట), కంబాల జోగులు(రాజాం) బుధవారం కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. గత అసెంబ్లీ సమావేశాల‍్లో జరిగిన పరిణామాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నానని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రివిలేజ్ కమిటీకి సమాచారం ఇచ్చారు.

అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ప్రివిలేజెస్ కమిటీ ఎదుట హాజరై ... తమ అభిప్రాయాలు వెల్లడించామన్నారు.  ప్రతిపక్ష పార్టీగా ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తమ గళం వినిపించామన్నారు. హోదా వచ్చేవరకూ తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement