ఇంటర్వ్యూకు వెళ్లిన యువతి అదృశ్యం | 28 years old woman missing: case registered by police | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూకు వెళ్లిన యువతి అదృశ్యం

Oct 3 2016 8:04 PM | Updated on Sep 4 2018 5:24 PM

ఇంటర్వ్యూకు వెళుతున్నానని ఇంటి నుంచి బయటికి వచ్చిన యువతి అదృశ్యమైంది.

హైదరాబాద్: ఇంటర్వ్యూకు వెళుతున్నానని ఇంటి నుంచి బయటికి వచ్చిన యువతి అదృశ్యమైంది. హైదరాబాద్ లో కలకలం రేపుతోన్న ఈ సంఘటనపై సోమవారం కాప్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసుల కథనం ప్రకారం..
 
నగరంలోని కాప్రా ప్రాంతానికి చెందిన పేముల ఎలిజబెత్ మాధురి(28) అనే యువతి సెప్టెంబర్ 22 న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇంటర్వ్యూకు వెళుతున్నానని చెప్పిన యువతి జాడ 10 రోజులైనా తెలియకపోవడం ఆమె తల్లి ఎస్తేర్ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement