
వ్యభిచార గృహంపై పోలీసుల ఆకస్మిక దాడులు
సరూర్నగర్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు.
హైదరాబాద్: సరూర్నగర్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ప్రగతినగర్లోని సాయిప్రతాప్ అపార్టుమెంట్లో కొనసాగుతున్న వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి చేసి నలుగురు మహిళలు, నలుగురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 సెల్ఫోన్లు, రూ.6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను సరూర్నగర్ పోలీసులకు అప్పగించారు.