గవర్నర్‌ మాతృమూర్తికి ప్రముఖుల నివాళులు

Honorary Members of Governor's Mother - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల మరణించిన గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మాతృమూర్తి విజయలక్ష్మికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. గురువారం రాజ్‌భవన్‌లో ఆమె పెద్దకర్మ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌ మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top