ప్రేమించి పెళ్లాడాడు.. ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడు | wife protesting at husband house | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లాడాడు.. ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడు

Oct 29 2015 1:20 PM | Updated on Jul 27 2018 2:18 PM

ప్రేమించానని వెంటాపడి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు కాపురం చేసి ఆడపిల్ల పుట్టిందనే కారణంతో మరో యువతిని పెళ్లాడటానికి ఓ భర్త సిద్దమైయ్యాడు.

విజయవాడ: ప్రేమించానని వెంట పడి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు కాపురం చేసి ఆడపిల్ల పుట్టిందనే కారణంతో మరో యువతిని పెళ్లాడటానికి ఓ భర్త సిద్ధమయ్యాడు. దీంతో సదరు భార్య.. తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది.

విజయవాడ గవర్నర్‌పేట ఆకులవీధిలో నివాసముంటున్న భార్గవి(25)ని అదే ప్రాతంలో నివాసముంటున్న నందిపాటి మధుసూదన రావు(29) ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. వివాహం చేసుకుని రెండేళ్లు కాపురం చేశాక ఆడపిల్ల పుట్టిందని భార్గవిని వదిలేశాడు. కుటుంబ సభ్యులు చెప్పిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన భార్గవి గురువారం ఐద్వా సభ్యుల సహకారంతో మధుసూదన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చుంది. భార్గవికి న్యాయం చేయాలని ఐద్వా సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement