స్పీకర్ వస్తున్నారని విద్యార్థినులతో మొరం పోయించిన స్పెషల్ ఆఫీసర్ | Sakshi
Sakshi News home page

స్పీకర్ వస్తున్నారని విద్యార్థినులతో మొరం పోయించిన స్పెషల్ ఆఫీసర్

Published Sun, Jul 26 2015 1:01 AM

స్పీకర్ వస్తున్నారని విద్యార్థినులతో మొరం పోయించిన స్పెషల్ ఆఫీసర్ - Sakshi

శాయంపేట: కస్తూర్బా పాఠశాల ప్రారంభానికి స్పీకర్ వస్తున్నారన్న సమాచారం స్పెషలాఫీసర్ శనివారం విద్యార్థులతో మొరం పోయించారు. పాఠశాల ఆవరణను చదును చేయించారు. వరంగల్ జిల్లాలో శాయంపేటలోని కస్తూర్బా పాఠశాల  లోపల, బయటి ఆవరణ వర్షపునీటితో మడుగులా తయారైంది. అయితే, భవనం ప్రారంభించేందుకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వస్తున్నారని తెలుసుకొన్న స్పెషల్ ఆఫీసర్ తన సొంత ఖర్చులతో సుమారు 40 ట్రాక్టర్ ట్రిప్పుల మొరం పోయించారు.  లెవలింగ్ చేయించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరారు.

Advertisement
Advertisement