మెదక్: జిల్లాలోని రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న(గురువారం, ఫిబ్రవరి 19వ తేదీ) మధ్యాహ్నం గుడ్డు కూర తిన్నారు విద్యార్థినులు.


అయితే అదే గుడ్డు కూరను రాత్రికి పులుసగా తయారుచేసి విద్యార్థులకు వడ్డించినట్లు తెలుస్తోంది. తద్వారా 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పది విద్యార్థులు తిరిగి కోలుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.



