భవిష్యత్ అవసరాల కోసం డబ్బు దాచుకున్న వ్యక్తి ఆ డబ్బు సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
పెరల్స్ బాధితుడి ఆత్మహత్య
Mar 2 2016 10:52 AM | Updated on Aug 29 2018 8:38 PM
దేవీపట్నం: భవిష్యత్ అవసరాల కోసం డబ్బు దాచుకున్న వ్యక్తి ఆ డబ్బు సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దండంగి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తపల్లి సూరయ్య(70) పెరల్స్ సంస్థలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఏజెంట్ను కోరాడు. దానికి ఏజెంట్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరయ్య కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
Advertisement
Advertisement