శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు | passengers protest in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు

Mar 17 2016 1:42 PM | Updated on Apr 7 2019 3:24 PM

శంషాబాద్ నుంచి విమానాశ్రయంలో 152 మంది ప్రయాణికులు విశాఖ వెళ్లాల్సిన విమానం కోసం పడిగాపులు కాశారు.

హైదరాబాద్: శంషాబాద్ నుంచి విమానాశ్రయంలో 152 మంది ప్రయాణికులు విశాఖ వెళ్లాల్సిన విమానం కోసం పడిగాపులు కాశారు. ఎయిర్‌ఇండియా 952 విమానం ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో విమానాశ్రయ అధికారులు వేర్వేరు విమానాల్లో ప్రయాణికులను గమ్యాలకు చేర్చటానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దాదాపు మధ్యాహ్నం వరకు కొంతమంది ప్రయాణికులు విమానాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. పొద్దున నుంచి కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదంటూ వారు నిరసన తెలిపారు. షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర అసౌర్యానికి గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement