శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు


హైదరాబాద్: శంషాబాద్ నుంచి విమానాశ్రయంలో 152 మంది ప్రయాణికులు విశాఖ వెళ్లాల్సిన విమానం కోసం పడిగాపులు కాశారు. ఎయిర్‌ఇండియా 952 విమానం ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో విమానాశ్రయ అధికారులు వేర్వేరు విమానాల్లో ప్రయాణికులను గమ్యాలకు చేర్చటానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో దాదాపు మధ్యాహ్నం వరకు కొంతమంది ప్రయాణికులు విమానాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. పొద్దున నుంచి కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదంటూ వారు నిరసన తెలిపారు. షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర అసౌర్యానికి గురయ్యారు.

 




 

Read also in:
Back to Top