నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) అధ్యయన, పరీక్ష కేంద్రాలుగా ఇకపై కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) పని చేయనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) అధ్యయన, పరీక్ష కేంద్రాలుగా ఇకపై కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) పని చేయనున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఎన్ఐఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ సీబీ శర్మ, కేవీ కమిషనర్ సంతోష్కుమార్ మల్ ఒప్పందం చేసుకున్నట్లు ఎన్ఐఓఎస్ హైదరాబాద్ రీజనల్ డెరైక్టర్ అనిల్కుమార్ తెలిపారు. దీంతో కేంద్రీయ విద్యాలయాల్లోని అధ్యయన కేంద్రాల్లో ఎన్ఐఓఎస్ శిక్షణ తరగతులు, బోధన, పరీక్షలు నిర్వహించుకునే వీలు కలిగిందన్నారు.