గిరిజనులు చదువు పై దృష్టి పెట్టాలి: గవర్నర్ | governor narasimhan tour in srikakulam district | Sakshi
Sakshi News home page

గిరిజనులు చదువు పై దృష్టి పెట్టాలి: గవర్నర్

Feb 15 2016 12:56 PM | Updated on Sep 2 2018 4:52 PM

గిరిజనులు చదువు పై దృష్టి పెట్టాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు.

పాలకొండ: గిరిజనులు చదువు పై దృష్టి పెట్టాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోని పీఎమ్‌ఆర్సీలో సోమవారం గిరిజన మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... గిరిజన కుటుంబ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలని, చదువు నేర్చుకొని కుటుంబంతో పాటు గ్రామానికి బాసటగా నిలవాలన్నారు. గిరిజనుల ఆర్థిక వనరులు కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, పలు పార్టీల నాయకులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement