గణేశ్ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన గొడవ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.
రాజుపాలెం: గణేశ్ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన గొడవ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో గురువారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉగ్గం బాలరాజును సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీసులను మోహరించారు.