30 నుంచి కోస్తా జిల్లాల్లో డా. ఖాదర్‌ ప్రసంగాలు

Dr. Khader Speeches on kostal districts on sept 30 - Sakshi

అటవీ వ్యవసాయ, సిరిధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్‌ వలీ(మైసూర్‌) ఈనెల 30, అక్టోబర్‌ 1,2 తేదీల్లో కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగు, సిరిధాన్యాలు – కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం– అన్ని రకాల వ్యాధులను నిర్మూలించే దేశీ ఆహార పద్ధతులపై ఆయన ప్రసంగిస్తారు. 30న ఉ. 10 గం.కు గుంటూరు (బాలాజీ మండపం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, బృందావన్‌ గార్డెన్స్, 5వ లైను), అదే రోజు సా. 4 గం.కు విజయవాడ (సిద్ధార్థ ఆర్ట్స్‌–సైన్స్‌ కళాశాల, మొగల్రాజపురం), అక్టోబర్‌ 1 ఉ. 10. గం.కు రాజమండ్రి (గేదెల నూకరాజు కల్యాణ మండపం, మెయిన్‌ రోడ్, ఎ.సి.గార్డెన్స్, రాజమండ్రి), అదేరోజు సా. 4 గం.కు కాకినాడ (అల్యూమ్ని ఆడిటోరియం హాల్, జె.ఎన్‌.టి.యు, కాకినాడ)లో డా. ఖాదర్‌ ప్రసంగి స్తారు. 2 (మంగళవారం)న సా. 3 గం.కు విశాఖ పట్నం(సిరిపురం జంక్షన్, హెచ్‌.పి. పెట్రోల్‌ బంకు ఎదురుగా) ఏయూ కాన్వకేషన్‌ హాల్‌లో ప్రసంగి స్తారు.
అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 70939 73999.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top