సీమాంధ్ర బరిలో మిగిలింది వీరే | Seemandhra elections candidates have balance to withdrawal nominations | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర బరిలో మిగిలింది వీరే

Apr 24 2014 3:59 AM | Updated on Aug 29 2018 8:54 PM

సీమాంధ్రలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు, ఉపసంహరణల ఘట్టానికి బుధవారం తెరపడింది. దీంతో 13 జిల్లాలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,043 మంది, 25 లోక్‌సభ సీట్లకు 333 మంది చొప్పున అభ్యర్థులు బరిలో మిగిలారు.

సీమాంధ్రలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు, ఉపసంహరణల ఘట్టానికి బుధవారం తెరపడింది. దీంతో 13 జిల్లాలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,043 మంది, 25 లోక్‌సభ సీట్లకు 333 మంది చొప్పున అభ్యర్థులు బరిలో మిగిలారు. మే 7న జరిగే పోలింగ్ కోసం 71,282 పోలింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు.
 
 బీజేపీతో పొత్తు కారణంగా టికెట్ కోల్పోయిన తెలుగు తమ్ముళ్లు రెబల్ అభ్యర్థులుగా కదనరంగంలో నిలవడంలో ముందున్నారు. అసలే బల‘హీన’ంగా ఉన్నామన్న మనోవేదన ఒకవైపు.. తమ్ముళ్ల అలకలు మరోవైపు టీడీపీ పార్టీకి శిరోభారంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చిన్నాచితకా నేతల్ని అభ్యర్థులుగా ఖరారు చేసింది. మొత్తంగా పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల దాఖలు వరకూ ఒకేమాటతో ఎన్నికల రంగంలోకి దూకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement