జనసేన పేరుతో పార్టీ పెట్టిన సినీ నటుడు పవన్ కళ్యాణ్... టీడీపీతో కుమ్మక్కయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్.ఎమ్.మోహన్రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: జనసేన పేరుతో పార్టీ పెట్టిన సినీ నటుడు పవన్ కళ్యాణ్... టీడీపీతో కుమ్మక్కయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్.ఎమ్.మోహన్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత దాన్ని నడపలేక చిరంజీవి కాంగ్రెస్లో కలిపారని, పార్టీ పెట్టక ముందే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజాన్నిఆపలేరని మోహన్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.