టీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తుంది:నారా లోకేష్ | don't believe kcr | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తుంది:నారా లోకేష్

Apr 24 2014 4:52 AM | Updated on Aug 29 2018 3:37 PM

టీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తుంది:నారా లోకేష్ - Sakshi

టీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తుంది:నారా లోకేష్

టీఆర్‌ఎస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, వారికి ఓటు వేస్తే అధికార మదంతో డబ్బులు సంపాదించుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అన్నారు.

ఆర్మూర్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, వారికి ఓటు వేస్తే అధికార మదంతో డబ్బులు సంపాదించుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అన్నారు. టీఆర్‌ఎస్ నాయకుల అధికార దాహానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని వివరించారు. చంద్రబాబు తొమ్మిదేళ్లలో నిర్మించిన సైబరాబాద్‌తో 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement