ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చే పార్టీలపై చర్యలు | Do not have possibility to Tampering in EVM | Sakshi
Sakshi News home page

ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చే పార్టీలపై చర్యలు

Apr 13 2014 4:28 PM | Updated on Aug 29 2018 8:54 PM

భన్వర్‌లాల్‌ - Sakshi

భన్వర్‌లాల్‌

రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం(ఇసి) రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ హెచ్చరించారు.

హైదరాబాద్: రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం(ఇసి) రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ హెచ్చరించారు.  గ్రామాల్లో ఈవీఎం నమూనాలను ప్రదర్శించి, ఓటర్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వద్దన్నారు. ఈవీఎంలలో  ట్యాంపరింగ్కు అవకాశం లేదని చెప్పారు. ఈవీఎంలోని నోటా ఆప్షన్‌పై ఓటర్లకు అవగాహన కల్పిస్తామన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా 1800 చెక్‌పోస్టులను  ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆధారాలు చూపకుండా తరలిస్తున్న 100 కోట్ల రూపాయలను పట్టుకున్నట్లు తెలిపారు. మూడున్నర లక్షల లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీలో రాష్ట్రం అగ్రస్థానానికి చేరిందన్నారు. ఓటర్లు డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు లోను  కావొద్దని భన్వర్ లాల్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement