ఎంతో దూరం నుంచి నేనొచ్చా... | andhra pradesh pcc chief raghuveera reddy wife sunitha compaigning | Sakshi
Sakshi News home page

ఎంతో దూరం నుంచి నేనొచ్చా...

Apr 14 2014 2:39 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎంతో దూరం నుంచి తాను వచ్చానని, తన ప్రసంగం వినేందుకైనా దగ్గరగా రావాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సతీమణి సునీత మహిళలను కోరారు.

 * ప్రసంగం వినేందుకు దగ్గరకు రాలేరా
 * రఘువీరా సతీమణి సునీత పిలుపు

అనంతపురం: ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎంతో దూరం నుంచి తాను వచ్చానని, తన ప్రసంగం వినేందుకైనా దగ్గరగా రావాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సతీమణి సునీత మహిళలను కోరారు.  ఆమె నిన్న మండల పరిధిలోని తాడంగిపల్లి, మోపుర్లపల్లి, ఎం.కొత్తపల్లి, గైరాజుపల్లి, నారనాగేపల్లి, బూచె ర్ల తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. కొత్తపల్లిలో మహిళలు దూరంగా నిలుచుని చూస్తుండడంతో ఆమె స్పందించారు.

తాను ఎంతో దూరం నుంచి మీ గ్రామానికి వస్తే, కనీసం తన ప్రసంగం వినడానికైనా దగ్గరగా రాలేరా? అంటూ మైక్ పట్టుకుని  ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త రఘువీరా రెడ్డి మడకశిర, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఎంతగానో అభివృద్ధి చేశాడని, ఇప్పుడు పెనుకొండలో అభివృద్థిచేయడానికి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని వివరించారు. ఈ నెల 16 న జరుగనున్న నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.  పలువురు కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement