సీఎం చంద్రబాబు మాటలు నీటి మూటలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం విశాఖపట్నంలోని సారగర తీరంలో నిరసన తెలిపారు.
సీఎం చంద్రబాబు మాటలు నీటి మూటలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం విశాఖపట్నంలోని సారగర తీరంలో నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ మండిపడ్డారు. ‘రాష్ట్ర ప్రభుత్వం హామీలు - నీటి మూటలు, గాలి బుడగలు... మంత్రులు రాజీనామాలు చేయండి - ఆంధ్రప్రదేశ్ను కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్ను, నీటి మూటలను, గాలి బుడగలను చేత్తో పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పోలా గురువులు, జాన్వెడ్లీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.