కారు ఢీకొని యువకుని మృతి | Youngster killed, car hits cycle | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని యువకుని మృతి

Apr 11 2016 7:36 AM | Updated on Sep 3 2017 9:42 PM

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సైకిల్‌పై వెళుతున్న ఒక యువకుని కారు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

చిట్యాల(నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సైకిల్‌పై వెళుతున్న ఒక యువకుని కారు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సంజీవరెడ్డి(23) అనే యువకుడు వ్యవసాయ పనుల నిమిత్తం సైకిల్‌పై పొలానికి వెళుతుండగా విజయవాడ నుంచి చిట్యాల వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో సంజీవరెడ్డి మృతిచెందాడు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుని మృతికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. కారును పట్టుకునేందుకు సమీప చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement