ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన | World bank delegates visit | Sakshi
Sakshi News home page

ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన

Dec 15 2016 11:16 PM | Updated on Sep 4 2017 10:48 PM

ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన

ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన

మండలంలోని జూపూడిలో గురువారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, అధికారులు పర్యటించి పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు.

అమరావతి: మండలంలోని జూపూడిలో గురువారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, అధికారులు పర్యటించి పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. వరల్డ్‌బ్యాంకు ప్రతినిధులు సాహితి, జాన్‌సన్, అభిషేక్‌ గుప్తా సయ్యద్, పాల్‌ ఆదాయ వనరులు, కుటుంబ పరిస్థితి, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. డీఆర్డీఏ పీడీ హబీబ్‌బాషా మాట్లాడుతూ వరల్డ్‌ బ్యాంకు సహకారంతో వెలుగు ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న 150 మండలాలను ఎంపిక చేశారన్నారు. అందులో భాగంగా జూపూడి గ్రామాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు ఈ గ్రామాలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. అనంతరం అమరావతి వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏరియా కో-అర్డినేటర్‌ సత్యసాయి, డీపీఎం  గౌరీనాయుడు, కిరణ్‌కుమార్, శర్మ, ఏపీఎం సునీత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement