లక్సెట్టిపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఉమామహేశ్వర్(50) అనే కార్మికుడు మృతిచెందాడు.
లక్సెట్టిపేట: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఉమామహేశ్వర్(50) అనే కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. బస్టాండ్లో సఫాయి కార్మికునిగా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ బస్టాడ్ గేటు నుంచి బయటికి వస్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.