‘గౌరు’ను భారీ మెజార్టీతో గెలిపించండి | work for gouru victory | Sakshi
Sakshi News home page

‘గౌరు’ను భారీ మెజార్టీతో గెలిపించండి

Mar 13 2017 12:08 AM | Updated on May 29 2018 4:37 PM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పిట్టం ప్రతాపరెడ్డి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలను కోరారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పిట్టం ప్రతాపరెడ్డి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలను కోరారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌరు  సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడని, రైతుల కష్టనష్టాల గురించి తెలిసిన వ్యక్తిని అలాంటి వారిని గెలిపిస్తే ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.  ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లాకు చేసిందేమి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాట ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం పడిగాపులు కాస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గౌర వెంకటరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement