వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jun 24 2017 11:31 PM | Updated on Sep 5 2017 2:22 PM

కనగానపల్లి మండలం బద్దలాపురంలో జింకల నరసింహులు భార్య ఉమక్క(30) అనే వివాహిత శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.

కనగానపల్లి (రాప్తాడు) : కనగానపల్లి మండలం బద్దలాపురంలో జింకల నరసింహులు భార్య ఉమక్క(30) అనే వివాహిత శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.  ఆమె ఆరు నెలలుగా కడుపు నొప్పితో బాధపడేదన్నారు. పలుచోట్ల వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుటపడకపోగా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement