రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం | Warning posters venture caused ransagar | Sakshi
Sakshi News home page

రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం

Jul 31 2016 11:34 PM | Updated on Sep 4 2017 7:13 AM

రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం

రాంసాగర్‌ వెంచర్‌లో హెచ్చరిక పోస్టర్ల కలకలం

చేర్యాల మండలంలోని రాంసాగర్‌ పరిధిలో ఉన్న రాంసాగర్‌ – కొమురవెల్లి రహదారిపైనున్న దుర్గా భవానీ ఆలయం వద్ద వెంచర్‌లో ఆదివారం హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి. స్థానికుల కథనం ప్రకారం..

చేర్యాల : మండలంలోని రాంసాగర్‌ పరిధిలో ఉన్న రాంసాగర్‌ – కొమురవెల్లి రహదారిపైనున్న దుర్గా భవానీ ఆలయం వద్ద వెంచర్‌లో ఆదివారం హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి. స్థానికుల కథనం ప్రకారం.. సిద్ధిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వేసిన ఈ వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రజెండాలు పాతి, మూడు హెచ్చరిక పోస్టర్లు అంటించారు. ఈ భూమిని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అప్పగించాలని.. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పోస్టర్లలో రాశారు. ఎస్సై లక్ష్మణ్‌రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఎర్రజెండాలు, పోస్టర్లను తొలగించారు. ఘటనపై విచారణ చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement