కాలిబాట భక్తులకు ఆధార్‌ తప్పనిసరి: టీటీడీ | walk way devotees must show Aadhaar Cards in Tirumala | Sakshi
Sakshi News home page

కాలిబాట భక్తులకు ఆధార్‌ తప్పనిసరి: టీటీడీ

Dec 22 2016 4:18 AM | Updated on May 25 2018 6:12 PM

కాలిబాట భక్తులకు ఆధార్‌ తప్పనిసరి: టీటీడీ - Sakshi

కాలిబాట భక్తులకు ఆధార్‌ తప్పనిసరి: టీటీడీ

కాలిబాట భక్తులకు టికెట్ల నమోదుకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయాలని టీటీడీ నిర్ణయించింది.

సాక్షి, తిరుమల: టీటీడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు గదుల బుకింగ్, అంగప్రదక్షిణం టికెట్ల నమోదులో ఆధార్‌ను అధికారులు తప్పనిసరి చేశారు. అదే విధానాన్ని ఇకపై కాలిబాట భక్తులకు వర్తింపచేయాలని టీటీడీ నిర్ణయించింది.

దీనిప్రకారం కాలిబాటల్లో వచ్చే భక్తులకు ప్రస్తుతం స్వీకరిస్తున్న ఫొటోమెట్రిక్‌ విధానాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో ఆధార్‌ నంబరు నమోదు చేసుకుని దివ్యదర్శనం(కాలిబాట) టికెట్లు ఇవ్వనున్నారు.  మరోవైపు శ్రీవారి దర్శనార్థం  శ్రీలంక ప్రధాని రణీల్‌ విక్రమ సింగే, సతీమణి మైత్రి విక్రమ సింగేతో కలసి తిరుమలకు చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement