వీఎస్‌యూలో బోధనా సిబ్బందిని నియమించాలి | vsu needs teaching staff | Sakshi
Sakshi News home page

వీఎస్‌యూలో బోధనా సిబ్బందిని నియమించాలి

Jul 26 2016 1:07 AM | Updated on Sep 4 2017 6:14 AM

నెల్లూరు (టౌన్‌) విక్రమ సింహపురి విశ్వవిద్యాయంలో పూర్తిస్థాయిలో బోధించేందుకు అధ్యాపకులు నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆది త్యసాయి డిమాండ్‌ చేశారు.

 
నెల్లూరు (టౌన్‌) విక్రమ సింహపురి విశ్వవిద్యాయంలో పూర్తిస్థాయిలో బోధించేందుకు అధ్యాపకులు నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆది త్యసాయి డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో విద్యార్థులకు బోధనకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాలేదన్నారు. ఏ ఏడాదికేడు కాంట్రాక్టు అధ్యాపకుల విధులను రెన్యువల్‌ చేస్తూ బోధనకు ఇబ్బం దులు లేకుండా చూసేవారని చెప్పా రు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులను నిలిపివేసిన నేపథ్యంలో సమస్య నెలకొందని తెలిపారు. ఈ విషయం హైకోర్టులో ఉన్నందున వీసీ, రిజిస్ట్రార్‌లు గెస్ట్‌ ఫ్యాకల్టీ పేరు తో కొత్తవారిని తీసుకునేందుకు కొత్త ప్రయత్నానికి తెరలేపారని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను కాకుండా గంటల ప్రకారం చెప్పే వారిని తీసుకోవాడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనేక ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. వీసీ, రిజిస్ట్రార్‌ తుగ్లక్‌ పాలనతో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement