లాభాల బాటలో విజయ డెయిరీ
నెల్లూరు రూరల్ :
జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి(విజయ డెయిరీ) లాభాలబాటలో పయనిస్తోందని డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
-
చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి
నెల్లూరు రూరల్ :
జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి(విజయ డెయిరీ) లాభాలబాటలో పయనిస్తోందని డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అన్నారు. స్థానిక వెంకటేశ్వరపురంలోని డెయిరీ ప్రధాన కార్యాలయంలో డెయిరీ పాలకవర్గ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో పాల విక్రయాల ద్వారా సంస్థకు రూ.4 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కావలి పాలశీతలీకరణ కేంద్రం భవనం శిథిలావస్థకు చేరినందున నూతన భవనం నిర్మించాలని, పాల సేకరణ లక్ష్యం పెంచాలని పాలకవర్గ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. సహకార చట్టం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 30వ తేదీతో ముగ్గురు పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగుస్తుందని, ఆయా స్థానాలకు వచ్చేనెల 21 వతేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల అధికారిగా నంద్యాల వరదారెడ్డి వ్యవహరిస్తారన్నారు. సెప్టెంబర్ 30న డెయిరీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ ఎండీ కృష్ణమోహన్, అడ్మిన్ కృష్ణమోహన్, పాలకవర్గసభ్యులు పాల్గొన్నారు.