అధికార లాంఛనాలతో రాంరెడ్డి అంత్యక్రియలు | venkanna crimiation in pathalingala | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో రాంరెడ్డి అంత్యక్రియలు

Mar 6 2016 2:42 AM | Updated on Sep 3 2017 7:04 PM

అధికార లాంఛనాలతో రాంరెడ్డి అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో రాంరెడ్డి అంత్యక్రియలు

అభిమాన నేత, అజాత శత్రువు, పీఏసీ చైర్మన్, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంతిమ యాత్రకు రాష్ట్ర నలుమూలల నుంచి రాజకీయనేతలు, అభిమానులు తరలివచ్చారు.

హాజరైన రాజకీయ ప్రముఖులు
కామేపల్లి/ఇల్లెందు: పీఏసీ చైర్మన్, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం పాతలింగాలలో ప్రభుత్వ లాంఛనాలతో శనివారం నిర్వహించారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తో హైదరాబాద్‌లో వెంకటరెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం విదితమే. భౌతికకాయాన్ని శుక్రవారం అర్ధరాత్రి స్వగ్రామానికి తరలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎల్పీ జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి, ఎమ్మెల్యేలు డీకే.అరుణ, జీవన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, పాయం వెంకటేశ్వర్లు, సండ్ర వెంకటవీరయ్య,  రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, బలరాంనాయక్, పొన్నాల లక్ష్మయ్య, వనమా వెంకటేశ్వర్‌రావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వెంకటరెడ్డి భౌతిక కాయానికి ఆయన సోదరుడు కృష్ణారెడ్డి తలకొరివి పెట్టారు. రాంరెడ్డి సోదరుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డ్డి, కుటుంబ సభ్యులు,  వేలాదిగా అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
 
ఫోన్‌లో పరామర్శించిన వైఎస్.జగన్
మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య సుచరితను ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ద్వారా వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. వెంకట్‌రెడ్డి మృతి రాష్ట్ర, జిల్లా ప్రజలకు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement