ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్‌ | Two red sanders smugglers arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్‌

Oct 9 2016 12:55 AM | Updated on Oct 20 2018 6:19 PM

ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్‌ - Sakshi

ఇద్దరు ‘ఎర్ర’ దొంగల అరెస్ట్‌

కావలిరూరల్‌ : ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్న లారీని పట్టుకుని ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్‌ చేసినట్లు కావలి రూరల్‌ ఎస్సై జి.పుల్లారావు తెలిపారు. జాతీయ రహదారిపై గౌరవరం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ లారీ పోలీసులను గమనించి వెనక్కి మళ్లీంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అనుమానించిన సిబ్బంది లారీని నిలిపి తనిఖీ చేశారు

 
  •  రూ.40 వేల నగదు, 4 ఎర్రచందనం దుంగల స్వాధీనం 
కావలిరూరల్‌ : ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్న లారీని పట్టుకుని ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్‌ చేసినట్లు కావలి రూరల్‌ ఎస్సై జి.పుల్లారావు తెలిపారు. జాతీయ రహదారిపై గౌరవరం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా  ఓ లారీ పోలీసులను గమనించి వెనక్కి మళ్లీంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అనుమానించిన సిబ్బంది లారీని నిలిపి తనిఖీ చేశారు. ఖాళీ కూరగాయల ట్రేల మధ్యలో 4 ఎర్రచందనం దుంగలు ఉండటంతో మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ యజమాని ఇమ్రాన్‌మేవ్, లారీలో ఉన్న పొదలకూరుకు చెందిన వేమిరెడ్డి సురేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ మార్గంలో తనిఖీలు ఉండవని, ఉదయగిరి నుంచి కావలి మీదుగా నెల్లూరుకు వెళ్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా వీరిపై ఎర్రచందనం కేసులున్నట్లు తేలిందన్నారు. ఎర్రచందనం తరలింపులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో విచారిస్తున్నామన్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement