రేపు రాష్ట్రస్థాయిలో జానపద సంబరాలు | tomorrow state level folk festivals | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రస్థాయిలో జానపద సంబరాలు

Aug 18 2016 11:09 PM | Updated on Sep 4 2017 9:50 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కళాకారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న జానపద సంబరాలు నిర్వహించనున్నట్టు ఆహ్వాన సంఘ కన్వీనర్‌ దువ్వి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కళాకారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న జానపద సంబరాలు నిర్వహించనున్నట్టు ఆహ్వాన సంఘ కన్వీనర్‌ దువ్వి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక వైఎంహెచ్‌ఎ హాలులో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన జానపద కళాకారులు డప్పు నృత్యం, బుర్రకథ, చెక్క భజన, పల్లెసుద్దులు వంటి జానపద కళలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ తదితరులు పాల్గొంటారని చెప్పారు. 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement