-
స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతి ప్రదానం
ఏలూరు సిటీ : ఏపీ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(అపుస్మా) ఆధ్వర్యంలో ఏలూరు జోన్ స్పోర్ట్స్ మీట్–16కు సంబందించి బహుమతి ప్రదానోత్సవ వేడుక స్థానిక వైఎంహెచ్ఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ–2 ఎంహెచ్ షరీఫ్, జిల్లా విద్యాశాఖాధికారి డి.మదుసూధనరావు, డీఎస్డీవో ఎండీ సిరాజ్, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ హాజరయ్యారు. స్పోర్ట్స్మీట్లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. 25 పాఠశాలల నుంచి 2,305 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్లలో పోటీపడ్డారు. అలాగే అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అపుస్మా 15 మంది రైతులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరుకాగా అపుస్మా జోన్ అధ్యక్షుడు ఎంఎన్.శ్రీకాంత్, సెక్రటరీ కె.విజయలక్ష్మి, కోశాధికారి ఎస్.రాజ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ఆర్కేఎ ప్రసాద్, జోనల్ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి జి.రవిశంకర్ పాల్గొన్నారు. -
రేపు రాష్ట్రస్థాయిలో జానపద సంబరాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న జానపద సంబరాలు నిర్వహించనున్నట్టు ఆహ్వాన సంఘ కన్వీనర్ దువ్వి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక వైఎంహెచ్ఎ హాలులో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన జానపద కళాకారులు డప్పు నృత్యం, బుర్రకథ, చెక్క భజన, పల్లెసుద్దులు వంటి జానపద కళలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ముగిసిన ఆరవ విడత పోలింగ్... ప్రధాని మోదీ కీలక ట్వీట్
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్లో తగ్గని ఈవీ సేల్స్
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కేవలం రూ.3,400 కోట్లకే అమ్మించారు.. ఎయిర్సెల్ ఫౌండర్ ఆవేదన
హార్ట్ టచింగ్ సబ్జెక్ట్తో 'నాన్నంటే' సినిమా
IPL 2024 Final: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు!?
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!
మొబైల్ ఓవర్పాస్ బ్రిడ్జ్.. ఇది చేయగలమా?: ఆనంద్ మహీంద్రా
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement